15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

శ్రమదానంతో రహదారి మరమ్మతులు

12-10-2025 06:05 PM

రామచంద్రపురం: తెల్లాపూర్ పౌర సంఘం ఆధ్వర్యంలో గేటెడ్ కాలనీల వాసులు ఆదివారం రహదారిలో గుంతలను పూడ్చి మరమ్మతులు చేశారు. రహదారిపై జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సభ్యులు సంతాపం తెలిపారు. గోపనపల్లి నుంచి కొల్లూరు వలయ రహదారి దశాబ్దాలుగా పూర్తికాలేదు. భవన నిర్మాణాల కారణంగా రహదారి మరీ దారుణంగా మారింది. గుంతలు, మట్టి కారణంగా ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వానికి తీసుకెళ్లినా పరిష్కారం రాలేదని, అందువల్ల స్వయంగా రహదారిని మరమ్మతు చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే రహదారిని వెంటనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రవాణా శాఖ ఉప పరిశీలకుడు నవీన్ ట్రాఫిక్ సర్దుబాటు చేశారు.