calender_icon.png 2 June, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీఐ దరఖాస్తులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు

31-05-2025 05:11:41 PM

- చర్యలు తీసుకునే వరకు పోరాడి తీరుతాం

- జిల్లా కార్యవర్గ సమావేశం ద్వజమెత్తిన ఆర్టీఐ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల గణేష్

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): సామాన్యులకి బ్రహ్మాస్త్రంగా పని చేస్తున్న సమాచార హక్కు చట్టం ప్రకారం చేసుకున్న దరఖాస్తులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఆర్టీఐ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల గణేష్(RTI Forum State President Bathula Ganesh) అన్నారు. శనివారం నాడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీఐ ఫోరం జిల్లా అధ్యక్షులు మంగరాయి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశంలో జిల్లా కమిటీ అందరికీ నియామక పత్రాలు అందజేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల గణేష్ ను జిల్లా అధ్యక్షులు, కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... సమాచారం కోసం ఇచ్చిన దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యం చేసి కాలయాపన చేస్తే సహించేది లేదని, ఆ అధికారులపై చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని రాష్ట్ర కమిషన్ స్థాయిలో కాకున్నా కోర్టు వరకు వెళ్లి పోరాడుతూ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే వరకు ఊరుకునేది లేదని ద్వజమెత్తారు. చాలా కార్యాలయాలలో అడిగిన సమాచారంను అధికారులు కావాలని నిర్లక్ష్య ధోరణితో కాలయాపన చేస్తూ కొన్ని చోట్ల తప్పుడు సమాచారం మరికొన్ని చోట్ల అసంపూర్తిగా సమాచారం ఇస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ చట్టం ప్రకారం సెక్షన్లను అనుసరించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షులు గుజ్జుల రవి కుమార్, నారాయణపేట జిల్లా అధ్యక్షులు నరేష్, మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడమటి బీంరెడ్డి, ఉపాధ్యక్షులు పొల శేఖర్ కోశాధికారి శ్రీనివాస్, మహబూబ్ నగర్ డివిజన్ అధ్యక్షులు బండి మల్లేష్, మండల రూరల్ అధ్యక్షులు ప్రసాద్, మహమ్మదాబాద్ మండల అధ్యక్షులు ముకుందా,  అడ్డాకుల మండల అధ్యక్షులు చంద్రశేఖర్, కౌకుంట్ల మండల అధ్యక్షులు సంతోష్, ముసాపెట్ మండల అధ్యక్షులు గణేష్, ప్రధాన కార్యదర్శి మామిల్ల శ్రీనివాస్, కోశాధికారి నాగవర్దన్, తదితరులు పాల్గొన్నారు.