రన్ ఫర్ వందేమాతరం
కూకట్పల్లి, ఆగస్టు 11 (విజయక్రాంతి): వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూ ర్తి చేసుకున్న సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో కూకట్పల్లిలో రన్ ఫర్ వందేమాతరం ర్యాలీని మంగళవారం నిర్వహించారు. కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఎన్సీఆర్ గార్డెన్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీకి బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ విద్య, క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థి శక్తి దేశ శక్తి అని పేర్కొన్నారు. నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులు అన్నారు. వందేమాతరం లాంటి దేశభక్తి గీతాలు భా రత స్వాతంత్రోద్యమంలో ప్రజలలో స్ఫూర్తి ని ఐక్యతను నింపాయని, అలాంటి జాతీయ భావాలను నేటి తరానికి చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు మోహన్ రావు, ప్రాంత సహాయ కార్యదర్శి రమేష్, బజరంగదళ్ నిర్వాహకులు జీవన్, తిరుపతిరెడ్డి, శివ చారి, మహేందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






