calender_icon.png 18 June, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానుకోటలో 1,61,748 మంది రైతులకు రైతు భరోసా

17-06-2025 10:15:16 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంలో మహబూబాబాద్ జిల్లాలోని 1,61,748 మంది రైతులకు మంగళవారం సాయంత్రం వరకు 127.91 కోట్ల రూపాయలను వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల(District Agriculture Officer Vijayanirmala) తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 512 గ్రామాలకు చెందిన 1,61,748 మంది రైతులకు రైతు భరోసా పథకం ద్వారా నిధులు జమ చేసినట్లు చెప్పారు.

కొత్త రైతులు 20 లోగా దరఖాస్తు చేసుకోవాలి

కొత్తగా జిల్లాలో వ్యవసాయ భూములను సిసిఎల్ఏ లెక్క ప్రకారం ఈనెల 5 వరకు ఖరీదు చేసిన రైతులు తమ పేర్లను ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని డీఏవో కోరారు. కొత్తగా భూములు కొన్న రైతులు పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, వ్యక్తిగత బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ పత్రాలతో దరఖాస్తు ఫారాన్ని క్లస్టర్ ఏఈఓ లకు అందజేయాలని డిఏఓ కోరారు.