15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

చిన్న వయసులోనే వార్డ్ మెంబర్‌గా గెలిచిన సాయి సింధు

16-12-2025 02:10 AM

అభినందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

బెజ్జంకి డిసెంబర్ 15:చిన్న వయసులోనే వార్డు మెంబర్ గెలవడం చాలా సంతోషమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో రెండో విడత లో జరిగిన ఎన్నికల్లోసిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రనికి చెందిన బోనగిరి సాయి సింధుజ వార్డ్ నెంబర్ గా విజయం సాధించింది. సోమవారం సాయి సింధుజ (22) క వ్వంపల్లి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలవగా శాలువా కప్పి అభినందించారు .

ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న వయసులోనే వార్డ్ నంబర్ గా గెలవడం చాలా సంతోషమని యువత, మహిళలు రాజకీయాలతో పాటు,అన్ని రంగాల్లో ముందుండాలని తెలిపారు , ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రజా ప్రభుత్వ పథకాలను అందించి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. మీ గ్రామ అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.