31 March, 2026 | 2:35 AM

ఇసుక డంపులు సీజ్

31-03-2026 12:29 AM

అయిజ మార్చి 30 అయిజ మండలంలోని పులికల్ గ్రామంలో అనుమతులు లే కుండా అక్రమంగా నిల్వచేసిన ఇసుక డంపు స్థావారాలపై నమ్మదగిన సమాచారం మేరకు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, మండల రెవెన్యూ అధికారి రఘునాథ్ రెడ్డి వెళ్లి ఇసుక డంపులను సీజ్ చేయడం జరిగిందని ఆర్ఐ తెలియజేశారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిలువ చేస్తే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.