calender_icon.png 8 December, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంధ్య ప్రశాంత్, జ్యోతిర్మయి శిరీష్ దంపతులకు ఘనంగా సన్మానం..

08-12-2025 05:36:45 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం అయ్యప్ప స్వాములకు రైస్ మిల్ వ్యాపారులు నాగమల్ల సంధ్యా ప్రశాంత్, ఐతు జ్యోతిర్మయి శిరీష్ దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి మిట్టపల్లి మురళీధర్ ఆ దంపతులకు అయ్యప్ప స్వామి శేష వస్త్రం, మెమొంటో అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ సాయిరీ పద్మ మహేందర్ దంపతులతో పాటు రైస్ మిల్లర్స్ వ్యాపారవేత్త జైపాల్ రెడ్డి,  మెరుగు వెంకటేశం, వేగోళం శంకర్ పలువురు ఉన్నారు.