18-08-2025 05:02:18 PM
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలం పెద్ద నాగారం గ్రామంలో ఘనంగా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన గ్రామ బహుజన, కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ... సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిస్తూ బహుజన హక్కుల కోసం బహుజనులంత ఒక్కతాటిపై ఉండాలని పిలుపునిచ్చారు.