18-08-2025 04:58:23 PM
బెజ్జంకి: మండల పరిధిలోని అన్ని గ్రామాలలో వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా తప్పకుండా నమోదు చేసుకోవాలని స్తానిక ఎస్ఐ బోయిని సౌజన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ లో అప్లికేషన్ నమోదు చేసుకున్నవారికి మాత్రమే అనుమతి లభిస్తుందని, నమోదు చేసుకొని వారికి అనుమతి లభించదని అని తెలిపారు. కచ్చితంగా అప్లికేషన్ లో సూచించిన అన్ని వివరాలు నమోదు చేసుకోవలని సూచించారు. మండపాలు ఏర్పాటు చేయాలనుకునేవారు https://policeportal.tspolice.gov.in/index.htm పోర్టల్లోకి లాగిన్ చేయాలని సూచించారు.