22 May, 2026 | 7:43 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్

27-03-2026 05:02 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని వెంకంపల్లి గ్రామంలో నూతన సిసి రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ సిహెచ్.జ్యోతి సురేందర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా నూతన సీసీ రోడ్డు పనులను గ్రామంలోని పోచమ్మ టెంపుల్ నుండి గ్రామపంచాయతీ వరకు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సిహెచ్ జ్యోతి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... ఎంజి ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు 10 లక్షల నిధులు మంజూరు కావడంతో నూతన సిసి రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి పది లక్షల నిధులు మంజూరుకు కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.