27 March, 2026 | 6:43 PM

అంచనూర్‌లో ఘనంగా సీతారాముల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు

27-03-2026 05:04 PM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా సర్పంచ్ జనగామ నరేష్ ఆధ్వర్యంలో సీతారాముల విగ్రహాల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. భక్తులు భజనలు, కీర్తనలు చేస్తూ గ్రామ వీధుల్లో ఊరేగింపుగా విగ్రహాలను తీసుకెళ్లారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు భారీగా హాజరై స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందారు. తరువాత మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు విస్తృతంగా పాల్గొన్నారు.