ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వాటా ఉండాలి
14-04-2026 12:00 AM
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి) : బీజేపీ ప్రభుత్వం మహిళలపై మొదటి నుంచి కపట ప్రేమ చూపిస్తోందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ విమర్శించారు. సోమవారం ఎర్రబెల్లి స్వర్ణ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ త్వరలో జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో వ్యతిరేక ముప్పు ఉందని గ్రహించిన మోదీ.. మహిళా బిల్లును తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకూ వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజీవ్గాంధీ హయాంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలనే చర్చ ప్రారంభమైందని గుర్తుచేశారు.




