9 May, 2026 | 9:45 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

భూములకు నష్టపరిహారం చెల్లింపుల్లో కుంభకోణం

25-04-2024 02:10 AM

ఏసీబీ డీఎస్పీ సోదాలు

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : జిల్లాలోని రేపల్లెవాడ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం సేకరించిన భూముల నష్టపరిహారం చెల్లింపులో పెద్ద ఎత్తున కుం భకోణం జరిగినట్లుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదుల అందడంతో బుధవారం కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సోదాలు నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలోని భూ నిర్వాసితులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకొని సంబంధిత అధి కారులను విచారించారు. గతంలో ఆర్డీఓగా విధులు నిర్వహించిన సిడం దత్తు, డీటీ నాగోరావు, ఎంసీ భరత్‌లను ప్రాథమికంగా విచారించినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. 

చెల్లింపులపై ఆరోపణలు..

భూముల సేకరణలో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు ఆరోపణలు న్నాయి. అనర్హులకు పెద్ద మొత్తంలో డబ్బు లు చెల్లించినట్లు అర్హులైన భూ నిర్వాసితులు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసిన సందర్భాలున్నా యి. ఏసీబీ అధికారుల సోదాలతో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి గుబులు మొదలైంది.