16 March, 2026 | 10:01 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ముగిసిన నామినేషన్ల పరిశీలన..

03-12-2025 11:21 PM

17 జీపీలకు 88 

156 వార్డుకు 389 నామినేషన్లు 

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో రెండో విడతగా వేసిన నామినేషన్ల ప్రక్రియ పరిశీలన ప్రక్రియ బుధవారం ముగిసింది. బెల్లంపల్లి మండలంలో 17 గ్రామ పంచాయతీలకు గాను 88 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. స్క్రూటినీలో 17 గ్రామ పంచాయతీలకు పడిన 88, నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. 156 వార్డులకు గాను వేసిన 389 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

నామినేషన్ల పరిశీలన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విజిట్ చేశారు. 4వ తేదీన అప్పిల్లకు గడువు, 5న అప్పిల్ ల పరిష్కారం, 6 నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. అనంతరం బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ ఘట్టం ముగిసిన వెంటనే ఎన్నికల పోరులో తలపడతారు. 14న ఎన్నికలు అదే రోజు ఓట్ల లెక్కింపు వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.