15 June, 2026 | 9:26 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •  

చిరంజీవి ట్రస్ట్‌కు కేంద్రం గుడ్‌న్యూస్‌

28-11-2025 09:03 AM
  1. చిరింజీవి ట్రస్టుకు కేంద్రం ఆమోద ముద్ర
  2. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కు ఎఫ్సీఆర్ఏ ఆమోదం 

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi Charitable Trust) స్వచ్ఛంద సంస్థకు విదేశీ విరాళాల అవకాశం కల్పించింది. విదేశీ వివరాలు స్వీకరించే వీలు ట్రస్టుకు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు కింద బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నడుపుతున్నారు. విదేశీ విరాళాలకు ఎఫ్ సీఆర్ఏ అనుమతి తీసుకోవాలని ఇటీవల నిబంధనల్లో మార్పులు చేశారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 కింద నమోదు చేసుకోవాలని నిబంధన ఉంది. నిబంధనల మార్పుతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు కేంద్రం అనుమతి కోరింది. ట్రస్టు విజ్ఞప్తికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమోద ముద్ర వేసినట్లు సమచారం.