3 July, 2026 | 11:36 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

గుట్టుగా గంజాయి సాగు

03-12-2024 12:57 AM
  1. మంగల్‌సింగ్  తండాలో గుర్తింపు
  2. ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో దాడులు
  3. రూ.70 లక్షల విలువ చేసే మొక్కల ధ్వంసం

నిర్మల్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని తండాల్లో గంజాయి సాగు గుట్టును పోలీసులు రట్టు చేశారు. కడెం, దస్తురాబాద్ మండలాల్లోని మారుమూల గ్రామాల్లో అడవుల మధ్య ఉన్న పల్లెలు, తండాల్లో కొందరు గంజాయి సాగు చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఎస్పీ జానకి షర్మిల, డీఎస్పీ గంగారెడ్డి, ఖానాపూర్, కడెం పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం వాగులు దాటి గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలకు వెళ్లారు.

మంగల్‌సింగ్ తండా లో ఇందల్, సజన్‌లాల్, గోతి రవీందర్, కదం సంతోష్, బామనే సురేందర్, ప్రతాప్‌సింగ్‌కు చెందిన పొలాల్లో పంటల మధ్యన గంజాయి మొక్కలను పెంచుతున్నట్టు గుర్తించారు. సుమారు రూ.70 లక్షల విలువ చేసే మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. మంగల్‌సింగ్ తండా దట్టమైన అడవి మధ్యలో ఉండడంతో రాకపోకలు అంతగా ఉండవు. ఇది ఆసరాగా భావించిన పలువురు గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

కొన్ని రోజులుగా ఈ ప్రాంతం నుంచే గంజాయి రవాణా అవుతున్నట్టు పోలీసులకు సమాచారం రావంతో వారు ప్రత్యేక దృష్టి సారించి దాడులు నిర్వహించారు. నాలుగేళ్లుగా ఈ ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్నట్టు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారంతా నేరాన్ని అంగీకరించడంతో వారిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు.