04-02-2026 12:57:10 AM
ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
సికింద్రాబాద్, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో అగ్రస్థానంలో నిలుపుతున్నామని, అయితే ప్రభుత్వం తన ఎన్నికల హామీలు నెరవేర్చక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగు ల్ల పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. బౌద్ధనగర్ డివిజన్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పద్మారావు గౌడ్ మంగళవారం ప్రారంభించారు.
అశోక్ నగర్, లలిత నగర్, శకుంతల స్కూల్, ఈశ్వరి బాయి నగర్, అంబర్ నగర్ ప్రాంతాల్లో రూ.94.20 లక్షల ఖర్చుతో సీసీ రోడ్డు నిర్మాణం పనులు, బౌద్ధనగర్ కనకదుర్గ టెంపుల్ వద్ద రూ.55 లక్షల ఖర్చుతో నాలా బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ పలు సందర్భాల్లో ప్రజల ఇబ్బందులు నివారించ డంలో తాము ముందు ఉంటామని అన్నా రు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సువర్ణ లత, మాధవి, వేణు, ప్రియాం క, కార్పొరేటర్ సామల హేమ, సమన్వయకర్త రాజ సుందర్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.