5 May, 2026 | 9:19 PM

మృతురాలి పాపని చూసి కన్నీటి పర్యంతమైన సీతక్క

05-05-2026 08:02 PM

హనుమకొండ రూరల్,(విజయక్రాంతి): రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో ఘనపురం వాస్తవ్యులు బండారి రాజయ్య  కుమార్తె, చక్రవర్తి హాస్పిటల్స్ సీఈవో సూర్య ప్రకాష్ సోదరి ఇటీవల మృతి చెందగా మంగళవారం తిరుమలగిరి గ్రామంలోని వారి నివాసానికి  పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు  ధనసరి అనసూయ సీతక్క, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, చక్రవర్తి హాస్పిటల్ డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి తో కలిసి విచ్చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిన్న పాపను చూసి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భావోద్వేగానికి గురై బాధపడ్డారు.అనంతరం  మృతురాలికి నివాళులు అర్పించి, కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  ములుగు,భూపాలపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, వైద్యులు, చక్రవర్తి హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.