09-12-2025 09:18:01 PM
గజ్వేల్: సిద్దిపేట జిల్లా ములుగులో మంగళవారం పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. ములుగు గ్రామ శివారులోని శ్యాంసుందర్ రెడ్డి వ్యవసాయం పొలం వద్ద సుమారు రూ. 7,40,520ల విలువైన 673 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంచడానికి మద్యం సీసాలు నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.