15-09-2025 01:14:18 PM
21 ఏండ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు..
చిట్యాల (విజయక్రాంతి): మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసులో 21 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో న్యాయస్థానం(Nalgonda POCSO Court) ఇన్చార్జి జడ్జి రోజా రమణి సంచలన తీర్పును వెల్లడించారు. చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన దోమల రాములు మూడవ తరగతి చదువుతున్న 8 ఏళ్ల మైనర్ బాలిక ఇంట్లోకి పిబ్రవరి 1వ తేది 2018 న తాగిన మైకంలో అక్రమంగా ఇంట్లొకి ప్రవేశించి సదరు మైనర్ బాలిక టీవి చూస్తుండగా బెదిరించి, లైంగిక దాడి చేశాడని, ఈ ఘటనపై బాధితురాలి తండ్రి 11 ఫిభ్రవరి 2018న చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించిన పోలీస్ లు చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిభ్రవరి 11, 2018న పోక్సో యాక్ట్ 2012 క్రింద కేసు నమోదు చేశారు.
ఎనిమిది ఏండ్ల సుదీర్ఘ విచారణ అనంతరం పోక్సో న్యాయస్థానం ఇన్చార్జి రోజా రమణి సోమవారం సెప్టెంబర్ 15న తీర్పు వెల్లడించడం జరిగింది. ఈ కేసులో నిందితునికి 21 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించి 30,000 జరిమానా విదించారు. బాధితురాలికి 10,00,000 నష్టపరిహారం చెల్లించాలని ప్రకటించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఐ.వోలుగా కె. భాస్కర్ రెడ్డి, డి సైదులు బాబు, కె.పాండు రంగారెడ్డి, భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన కీలకంగా వ్యవహరించారు. ఈ తీర్పు లైంగిక వేధింపులకు పాల్పడే వారికి గుణపాఠంగా మారిందని ప్రజలు పేర్కొన్నారు.