11 March, 2026 | 2:59 PM

Breaking News

కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •  

మానవసేవే మాధవసేవ..

06-12-2025 07:50 PM

ఉప్పల్ (విజయక్రాంతి): మానవసేవనే మాధవసేవా అని స్మైల్ విత్ షైన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు గ్రేసీ అన్నారు. స్మైల్ విత్ షైన్ ఆధ్వర్యంలో నాచారం దుర్గానగర్ లో శనివారం రోజున హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు దుప్పట్లు కిరాణ సామాన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఐవి పట్ల అపోహలు మాని అవగాహన పెంచుకోవాలన్నారు. మానవసేవే మాధవసేవ అని వ్యాధి వచ్చింది అని భయపడకుండా మనోధైర్యంతో ఉండాలని ఆమె సూచించారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్యుని సూచనలు మేరకు మందులు వాడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో లాజర్ పాస్టర్ శాంసన్ రోజా నంద రెడ్డి పాల్గొన్నారు.