17 April, 2026 | 10:07 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

హైడ్రాకు ఫిర్యాదు చేసిన 24గంటల్లో మురుగు సమస్యకు పరిష్కారం..

22-04-2025 11:43 PM

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): తమ ఇండ్లు మురుగు నీటిలో మునిగాయని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండలం రామచంద్రయ్య కాలనీ వాసులు ఫిర్యాదు చేసిన 24 గంటల్లో హైడ్రా అధికారులు మురుగు సమస్యకు పరిష్కారం చూపారు. తమ ఇండ్లు మురుగులో కూరుకుపోవడంతో ఇండ్లు ఖాళీ చేయాల్సి వస్తోందని రామచంద్రయ్య కాలనీ వాసులు హైడ్రాకు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో శాటిలైట్ ద్వారా పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం హైడ్రా అధికారులు రామచంద్రయ్య కాలనీకి వెళ్లి మురుగు కాలువను పునరుద్ధరించారు. దీంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు.