04-08-2025 12:47:59 AM
కామారెడ్డి, ఆగస్టు03 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు హనుమండ్ల రాజు భార్య అనారోగ్యంతో గత సంవత్సరం నుండి హైదరాబాదులో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు.మృతి చెందిన విషయాన్ని తెలుసు కున్న తెలంగాణ రాష్ట్ర సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదివారం హనుమండ్ల రాజు ఇంటికి వచ్చి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
గత ఐదు సంవత్సరాల క్రితం వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడి పోయారు. కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి మహిళా నాయకురాలు ను కోల్పోవడం జరిగిందని షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రాజు కుటుంబానికి, ఆయన కుమారునికి అండగా ఉంటానని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మసూద్. గుడుగుల శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ చైర్మన్ పున్న రాజేశ్వర్, మెడికల్ రాజు,ఆనంద్, జమీల్, లక్కపతిని గంగాధర,కాంగ్రెస్ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.