3 July, 2026 | 11:19 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా రంగాల్లో రాణించాలి

23-10-2024 04:53 PM

కరీంనగర్ (విజయక్రాంతి): విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో గ్రంథాలయం ప్రారంభించిన అనంతరం విద్యార్థులకు బూట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో క్రీడాకారులకు కొరత ఉందని చదువుతో పాటు ఆటల్లో రాణిస్తే సమాజంలో గుర్తింపు, గౌరవం, ఉన్నత ఉద్యోగాలు దక్కుతాయన్నారు. కష్టాన్ని నమ్ముకుని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. క్రీడా పాఠశాల విద్యార్థులకు ప్రతివారం తప్పనిసరిగా ఒక సందేశంత్మక సినిమా చూపించాలని అధికారులకు సూచించారు. త్వరలో క్రీడా పరికరాలు, దుస్తులు అందిస్తామన్నారు. అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ.. తక్కువ సమయంలో సమాజంలో గౌరవం సంపాదించాలంటే క్రీడలను ఎంచుకోవడమే మార్గం అన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  డీవైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ రాంబాబు, పాఠశాల హెచ్ఎం లీలా ప్రసాద్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.