22-06-2025 12:00:00 AM
స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కిషోర్ గరికిపాటి నిర్మాతగా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజాచిత్రం ‘షో టైమ్’. నవీన్చంద్ర హీరోగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నరేశ్ వీకే, రాజారవీంద్ర ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ను హీరో అడవి శేష్ చేతుల మీదుగా శనివారం విడుదల చేశారు. ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోందని, అన్నివర్గాల ప్రేక్షకులను రంజింపజేసే కంటెంట్ ఈ సినిమాలో ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్చంద్ర; డైలాగ్స్: శ్రీనివాస్ గవిరెడ్డి; సినిమాటోగ్రఫీ: టీ వినోద్ రాజా ఎంఎఫ్ఐ; ఎడిటర్: శరత్కుమార్; నిర్మాత: కిషోర్ గరికిపాటి; దర్శకత్వం: మదన్ దక్షిణామూర్తి.