మహాకాళి సెట్స్లో శుక్రాచార్యుడు!
భూమి శెట్టి టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మహాకాళి’. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఇందులో శుక్రాచార్యుడి పాత్రలో నటిస్తూ, టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ షోరన్నర్గా వ్యవహరిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌరాణిక చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది.
శనివారం అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ మూవీ సెట్స్ నుంచి ఒక కొత్త స్టిల్ను విడుదల చేశారు. చిత్రబృందం 100 రోజుల షూటింగ్ను విజయవంతంగా పూర్తి చేయగా, చివరి 40 రోజుల షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది.
శుక్రాచార్యుడి పాత్ర కోసం అక్షయ్ ఖన్నా తన చిత్రీకరణను పూర్తి చేశారు. మరోవైపు వీఎఫ్ఎక్స్ పనులు శర వేగంతో సాగుతున్నాయి. నిర్మాతలు త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం సమకూర్చుతుండగా, సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగలా ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేస్తున్నారు.




