17-05-2025 04:35:32 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): జమ్మికుంట పట్టణ సీఐగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ గౌడ్(CI Ramakrishna Goud)ను శనివారం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సమైక్య ఉపాధ్యక్షులు సిలివేరు శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పట్టణంలో యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్న పరిస్థితిని సీఐ దృష్టికి తీసుకువెళ్లి, ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐ రామకృష్ణ గౌడ్ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.