17-05-2025 04:33:07 PM
బాల ఆంజనేయ భక్తుల పాదయాత్ర..
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బాలాంజనేయ స్వామి భక్తమండలి ఆధ్వర్యంలో పహల్గామ్ దాడిలో అమరులైన జవాన్ల ఆత్మశాంతికి, దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు సంఘీభావంగా, శనివారం జమ్మికుంట నుండి ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి దేవస్థానం వరకు భక్తులు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ స్వామి మాట్లాడుతూ... మన వీర సైనికుల త్యాగం ఎందరికీ ప్రేరణగా నిలుస్తుంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, జోహార్లు తెలుపుతూ ఈ పాదయాత్ర చేపట్టాం అన్నారు. ఈ కార్యక్రమంలో బాలాంజనేయ స్వామి భక్తి భజన బృందం సభ్యులు విలాసాగర్ సమ్మయ్య స్వామి, సముద్రాల ఐలయ్య, స్వామి, శ్రీనివాస్, స్వామి' ఒగ్గు కళాకారుల బృందం, హనుమాన్ మాల ధరించిన అనేకమంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.