08-11-2025 08:46:53 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ & ప్లానింగ్) కే.వెంకటేశ్వర్లు శనివారం ఇల్లందు ఏరియా కోయగూడెం ఓ.సి లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన పని స్థలాలను సందర్శించి అక్కడ జరుగుచున్న పనులను పరిశీలించారు. రోజు వారి బొగ్గు ఉత్పత్తి మరియు రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను జి.యం వి.కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు.
తరువాత డైరెక్టర్ (పి.పి) కే.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజు వారి లక్ష్యాలను అధిగమించాలని, బొగ్గు ఉత్ప, రవాణాకు ఎటువంటి ఆటంకములు కలుగకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని, అలాగే వర్షాకాలంలో ఎదురైయే సమస్యలు గురించి తెలుసుకోని అలాగే వర్షాలు ఉన్నందున ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా రక్షణతో కూడిన ఉత్పత్తి తీయాలని, సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను అధిగమి౦చాలని అన్నారు.