13-10-2025 01:41:21 AM
హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 12, (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ర్టంలోని ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఆవిష్కరణ లను అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లిన సిరిసిల్ల బిడ్డ, గ్రావ్టన్ మోటార్స్ వ్యవస్థాపకుడు పర్శురామ్ పాకను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఒక ఆవిష్క ర్తకు ప్రేరణనిచ్చే ఎకో సిస్టం లభించినప్పుడు అద్భుతాలు జరుగుతాయని కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.
పర్శురామ్ పాక వంటి ప్రతిభావంతులను పోషించడంలో తెలంగాణలోని ఆవిష్కరణల కేంద్రాలైన టీ-హబ్, టీ-వర్క్స్ పాత్ర కీలకమని కొనియా డారు. ‘సిరిసిల్లకు చెందిన పర్శురామ్ పాక ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ. ఇంజనీరింగ్లో నేపథ్యం, అమెరికాలో అనుభవం ఉన్న ఆయన, మన ఇంక్యుబేటర్ల వద్ద ఉన్న అత్యాధునిక సౌకర్యాలను ఉపయోగించుకుని గ్రావ్టన్ మోటార్స్ను స్థాపించారు.
నేడు ఈ సంస్థ తెలంగాణ నుంచే ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తయారు చేస్తోంది’ అని కేటీఆర్ తన పోస్ట్లో పేర్కొన్నారు. గ్రావ్టన్ మోటార్స్ తమ మోటార్లు, బ్యాటరీలు, కంట్రోల్ సిస్టమ్స్ను పూర్తిగా దేశీయం గా రూపొందించి, తయారు చేసిందని మాజీ మంత్రి తెలిపారు. ఇది నిజమైన ‘మేడ్-ఇన్-ఇండియా, మేడ్-ఫర్-ది-వరల్డ్’ విజయగాథ అని అభివర్ణించారు.
కే2కే ప్రపంచ రికార్డ్..
గతంలో గ్రావ్టన్ మోటార్స్ సంస్థ నాలు గు వేల కిలోమీటర్ల కశ్మీర్-టు-కన్యాకుమారి రైడ్ను పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ప్రస్తుతం ఈ కంపెనీ కెన్యా, ఫిలిప్పీ న్స్, పెరూ వంటి దేశాలకు తమ కార్యకలాపాలను విస్తరిస్తోందని కేటీఆర్ గుర్తు చేశా రు. శుక్రవారం కోయంబత్తూరులో పర్శురామ్ పాకను కలిశానని, వారి కంపెనీ ప్ర యాణం, విజయాలు తనను ఎంతగానో ప్రేరేపించాయని కేటీఆర్ తెలిపారు.
‘ఇది నాకు నిజంగా అవసరమైన ఎనర్జీ బూస్టర్. ఈవీ బృం దానికి అభినందనలు. మీ కథ మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆవిష్కరణల వ్యవస్థ స్థానిక మేధస్సును ప్రభావిత శక్తిగా మారుస్తూ, భారతదేశ ఈవీ విప్లవాన్ని ముందుకు నడిపిస్తున్నాయని కొనియాడారు.