28 March, 2026 | 4:02 AM

వైభవంగా సీతారాముల కల్యాణం

28-03-2026 02:06 AM

సింగం భాను ఆధ్వరంలో నిర్వహణ

హైదరాబాద్, మార్చి 27(విజయక్రాంతి): భారతీయ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాతృశక్తి విభాగంలో సింగం భాను ఆధ్వర్యంలో మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీరాముడి దివ్య ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షురాలు స్వప్న సహా సంస్థ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. భక్తులకు అన్నదానం, ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని సింగం భాను, స్వప్న తెలిపారు.