28-05-2025 09:52:47 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జూన్ 2 నుంచి స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సబ్ రిజిస్టర్ అప్పారావు(Sub-Registrar Apparao) తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రతిరోజు 48 స్లాట్ బుకింగ్ లకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు 24 స్లాట్లు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 24 స్లాట్ లో ఉంటాయని వెల్లడించారు.
స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి వేలిముద్రతో పాటు ఈ సిగ్నేచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో అక్రమాలకు తావు లేకుండా ఉంటుందన్నారు. స్లాట్ బుకింగ్ లేనివారికి సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో రోజుకి ఐదు రిజిస్ట్రేషన్లను మాత్రమే చేయడం జరుగుతుందన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకునేవారు registration.telangana.gov.in అనే వెబ్సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.