03-07-2025 02:35:32 AM
చేవెళ్ల, జూలై 2: పుష్ప సినిమా స్టైల్లో వాహనాన్ని రీ డిజైన్ చేసి, తెల్ల చందనం చెక్కలను అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురిని మాదాపూర్ ఎస్వోటీ, చేవెళ్ల పోలీసులు పట్టుకున్నారు. బుధవారం ఏసీపీ కిషన్ చేవెళ్ల పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని సంగ్లి జిల్లా ఉంత్వాడి గ్రామం నుంచి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తాళ్లపల్లిలో ఉన్న ‘ఆంధ్రా పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ’కి అక్రమంగా తెల్ల చందనం చెక్కలు తరలిస్తున్నట్లు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే చేవెళ్ల పోలీసుల తో కలిసి మండలంలోని బస్తేపూర్ వద్ద నేషనల్ హైవే 163పై వాహనాల తనిఖీ చేపట్టా రు. మహారాష్ట్రకు చెందిన వ్యాన్ను తనిఖీ చేయగా మొదట ఖాళీగా కనిపించింది. వాహన తనిఖీ సమయంలో సువాసన రావడంతో మరింత క్షుణ్ణంగా పరిశీలించగా.. డ్రైవర్ కేబిన్ వెనుక భాగంలో కంటైనర్ టైపులో రహస్య విభాగం కనిపించింది. దా న్ని తెరిచి చూడగా నలుపు, తెలుపు, పసుపు, నలుపు రంగుల్లో ఉన్న ఫర్టిలైజర్ బ్యాగులు ఒకదానిపై ఒకటి పేర్చి ఉన్నాయి.
అందులో చిన్న చిన్న చెక్క ముక్కలు ఉండటంతో అటవీ శాఖ అధికారులకు సమాచా రం ఇవ్వగా... వాటిని సాంటాలమ్ అల్బమ్ శాస్త్రీ య పేరు కలిగిన తెల్ల చందనంగా నిర్ధారించారు. డ్రైవర్ అబ్దుల్ అజీజ్ (కర్నాటక), పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ సూపర్ వైజర్ కేవీపీ షుహైబ్ (కేరళ), అమ్మిన వ్యక్తి (రైతు/వ్యాపారి) విజయ్ హన్మంత్ మానే (మహారాష్ట్ర) ను అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్ణు సీజ్ చేసి చేవెళ్ల పోలీస్ స్టేషన్కు తరలించారు.
నాలుగు ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ తెల్ల చందనం చెక్క లు టన్ను (1000 కిలోలు) బరువున్నాయ ని, వీటి విలువ రూ.30 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకు ఉంటుందని ఏసీపీ తెలిపారు. ముగ్గురు నిందితులతో పాటు ఫ్యాక్ట రీ యజమాని నాగర్గూడకు చెందిన అబ్దు ల్లా కున్హి, మేనేజర్ సాదిక్ పైనా కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. సమావేశంలో చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్, మాదాపూర్ ఎస్వోటీ ఇన్ స్పెక్టర్ సం జయ్, ఎస్సై సతీశ్రెడ్డి, చేవెళ్ల ఎస్సై శీరిష, చిల్కూరు ఫారెస్ట్ ఆఫీసర్ రవి కుమార్ ఉన్నారు.