calender_icon.png 2 June, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల్లో సామాజిక చైతన్యం కలిగించాలి

28-05-2025 12:00:00 AM

డీఈఓవెంకటేశ్వరాచారి, డీఎస్‌పీ సతీష్ కుమార్ 

భద్రాద్రి కొత్తగూడెం మే 27 (విజయ క్రాంతి): ఉపాధ్యాయులందరూ విద్యార్థుల లోసామర్ధ్యాలు పెంపొందింస్తూ మరో వైపు వారిలో సామాజిక చైతన్యం పెంపొందించాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరా చా రి ,పాల్వంచ  డి.ఎస్.పి  .సతీష్ కుమార్ లు ఉపాధ్యాయులను కోరారు .మంగళవారం పాత పాల్వంచ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగుతున్న బయోలాజికల్ సై న్స్ టీచర్ల రెండో స్పెల్ ఐదు రోజుల శిక్షణ తరగతులు నందు ముఖ్య అతిధులుగా పా ల్గొని మట్లాడారు .

టెక్నాలజీని ఉపయోగించుకొని బోధనలో నూతన పద్ధతులు అ వలంబించాలని సూచించారు .సతీష్ కుమార్ పోక్సో ,మానవ అక్రమ రవాణా , డ్రగ్స్ వినియోం సైబర్  నేరాలపై పై అవగాహన కల్పించారు .అనంతరం డీఈవో, డి.ఎ స్.పి లను ఘనంగా సత్కరించారు .కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ పద్మలత ,ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు, కవిరత్న సురేష్ బా బు తోటమల్ల , డి ఆర్ పి లు ఎడారి ప్రకాష్ ,పరమయ్య, జయబాబు ,కమలాకర్ లు పాల్గొన్నారు.