calender_icon.png 1 July, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజాన్ని చైతన్యం చేయాలి

30-06-2025 07:43:03 PM

నిర్మల్ (విజయక్రాంతి): సమాజ అభ్యున్నతిలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని ప్రజలను చైతన్యం చేసి సమాజాభివృద్ధి వైపు నడిపించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యులు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసి శాలువాతో సన్మానించారు. నిర్మల్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు సంతోషంగా ఉందని సమాజంలో శాంతి భద్రతల పర్యవేక్షణ నేరెళ్ల నియంత్రణలు కూడా పోలీస్ శాఖతో కలిసి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాకేష్ మీనా ఉపేందర్ రెడ్డి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాసం శ్రీధర్ ప్రధాన కార్యదర్శి బి లక్ష్మీనారాయణ కోశాధికారి సందీప్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.