1 April, 2026 | 1:53 AM

మెత్తబడ్డ పాక్.. హైబ్రిడ్‌కు ఓకే..

01-12-2024 12:00 AM

దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ  2025లో భారత్ ఆడే మ్యా చ్‌లను పాక్ బయట నిర్వహించేందుకు పీసీబీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. మొదట మొండికేసినా కానీ ఐసీసీ బెదిరింపులతో హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

కానీ ఇక్కడే పాక్ తన వక్రబుద్ధిని బయటపెట్టింది. భారత్ ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో జరిపితే భవిష్యత్‌లో భారత్‌లో జరిగే ఐసీసీ ఈ వెంట్లలో పాక్ ఆడే మ్యాచ్‌లను కూడా తట స్థ వేదికల్లో జరపాలని పట్టుబడుతోంది. ఈ కండీషన్‌కు ఐసీసీ ఒప్పుకుంటుందో లేదో..