01-12-2024 12:00:00 AM
కాన్బెర్రా: ప్రైమ్ మినిస్టర్-11 తో వార్మప్ మ్యాచ్లో మొదటి రోజు తుడిచిపెట్టుకుపోయింది. వరుణుడు ఎంతకూ కరుణించకపోవడంతో బంతి కూడా పడకుండానే మొదటి రోజు ఆటను రద్దు చేశారు.
మొదటి టెస్టు ఆడని భారత కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఈ టెస్టు ఆడి సత్తా చాటాలని అనేక మంది అభిమానులు ఉవ్విళ్లూరారు. కానీ వరుణుడు మాత్రం వేరేలా ఆలోచించి టాస్ కూడా పడనీయలేదు. గాయం వల్ల తొలి టెస్టుకు దూరంగా ఉన్న గిల్ ఈ టెస్టు ఆడతాడని అంతా భావించారు.