2 July, 2026 | 2:36 PM

Breaking News

గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •  

అడవిలో మట్టి దొంగలు

14-04-2025 01:41 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి అడవిలోని 1168 కంపార్ట్మెంటులో రెండు రోజుల క్రితం రాత్రిపూట కొందరు జెసిబి తో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలించారు.

ఈ ఘటన తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనస్థలికి చేరుకునేసరికి మట్టి తరలించుకుపోయే వ్యక్తులు పారిపోయారు. ఈ ఘటనపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నవీన్ కేసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఫారెస్ట్ చట్టం ప్రకారం కూడా కేసు నమోదు చేయుటకు ఎఎఫ్‌ఆర్వో తెలిపారు. సుమారు ఆరు మీటర్ల మేర గొయ్యితవ్వి మట్టి తరలించినట్లు తెలిపారు.