calender_icon.png 6 June, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం

04-06-2025 09:13:12 PM

అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి...

మహబూబాబాద్ (విజయక్రాంతి): భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు దోహదపడతాయని, రైతులు తమ సమస్యలను రెవిన్యూ సదస్సుల్లో అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కే.వీరబ్రహ్మచారి(District Additional Collector K. Veerabrahmachari) కోరారు. బుధవారం బయ్యారం మండలం గౌరారంలో జరుగుతున్న సదస్సును అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టం భూ సమస్యల పరిష్కారానికి సులభతరమైన, న్యాయమైన విస్తృత సేవలు అందించాలని మంచి ఉద్దేశంతో ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.

ఈ సదస్సులో సమస్యలు ఉన్న రైతులు, ప్రజలు వినియోగించుకోవాలి సూచించారు. ధరకాస్తు ఇవ్వడం కోసం వచ్చే వారికి కేంద్రంలో అన్ని ఏర్పాట్లు సమకూర్చాలని అన్నారు. రెండు బృందాలుగా రెవెన్యూ సిబ్బందిని నియమించి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేసముద్రం మండలం అన్నారం, ఉప్పరపల్లి గ్రామాల్లో నిర్వహించిన రెవిన్యూ సదస్సులను ఆర్డిఓ కృష్ణవేణి సందర్శించి దరఖాస్తుల స్వీకరణ తీరును పరిశీలించారు.