calender_icon.png 12 November, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో రాజముద్రతో పాస్ పుస్తకాలు

30-07-2024 01:46:07 AM

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, రూట్ మ్యాప్

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకా లు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ప్రజల పాసు పుస్తకాలపై మాజీ సీఎం జగన్ తన బొమ్మల కోసం రూ.15 కోట్లు ఖర్చుచేశారని, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు, ప్రజల కోరిక మేరకు రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఇచ్చేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజముద్రతో ఉన్న పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అధికారులు చూపించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా అధికారులు ఏర్పాటు చేశారు.

రీసర్వే పేరుతో పొలాల సర్వేకు వైసీపీ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని చంద్రబాబు చెప్పారు. సరిహద్దు రాళ్లపైనా తన బొమ్మలు ఉండాలన్న నాటి సీఎం జగన్ కోరిక తీర్చుకునేందుకు రూ. 650 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. కేంద్రం చెప్పిన రీసర్వేలో ఎక్కడా రాళ్లు పాతాలని లేకపోయినా, తన బొమ్మల కోసం జగన్ గ్రానైట్ రాళ్లు సిద్ధం చేశారని, మాజీ సీఎం బొమ్మ ఉన్న 77  లక్షల గ్రానైట్ రాళ్లను ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వ కసరత్తు చేస్తోందని పేర్కొన్నారు. ఆ రాళ్లపై బొమ్మలు చెరపడానికి మరో రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తాత్కాలిక అంచనా వేశారని, జగన్ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా రూ.700 కోట్ల వరకు ప్రజా సొమ్ము వృథా అవుతుందని గుర్తించామని చెప్పారు.

ఆ గ్రానె ైట్ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు.. వాటితో ఏం చేయాలో చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. జిల్లాలవారీగా ఏ మేరకు భూములు అక్రమంగా అన్యాక్రాంతమయ్యాయో లెక్కలు తీయాలని ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా, సీసీఎల్‌ఏ ఆయా జిల్లాల్లో పర్యటించి సమాచార సేకరణకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.