గవర్నర్ను కలిసిన ద.మ రైల్వే జనరల్ మేనేజర్
25-03-2026 12:29 AM
సికింద్రాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మంగళవారం లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టు ల పురోగతి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై గవర్నర్కు వివరించారు. తెలం గాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరించారు. గవర్నర్ ఈ సందర్భంగా రైల్వే శాఖ చేపడుతున్న అభి వృద్ధి కార్యక్రమాలను ప్రశంసిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి రైల్వే రంగం కీలకమని పేర్కొన్నారు.




