20 March, 2026 | 8:04 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

జాతర బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

07-01-2026 12:26 AM

ఉట్నూర్, జనవరి 6 (విజయక్రాంతి): ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే నాగోబా జాతర ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ తరపు నుంచి చేపట్టే బందోబస్తు ఏర్పాట్లను  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  పరిశీలించారు. మంగళవారం సాయంకాలం నాగోబా ఆలయానికి చేరుకున్న ఎస్పీ ఏఎస్పీ కాజల్ సింగ్ తో కలిసి నాగోబా దేవుడికి పూజలు నిర్వహించారు. అనంతరం జాతర సందర్భంగా బందోబస్తుతో పాటు జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా రోడ్డులను పరిశీలించారు. 

జాతర  సందర్భంగా చట్ట వ్యతిరేక పనులు, దొంగతనాలు, జూదం, లాటరీలు ప్రజలను మోసగించే పనులు చేసే వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. ఎస్పీ తో  శిక్షణ ఐపీఎస్ అధికారి రాహుల్ కాంత్,  డి.ఎస్.పి పోతారం శ్రీనివాస్, సీఐ  మడవి ప్రసాద్, ఎస్సై సాయన్న, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.