20 March, 2026 | 6:33 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ప్రజల గొంతుక ‘విజయక్రాంతి’ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

07-01-2026 12:27 AM

వాస్తవాలకు నిలువుటద్దం: కొండకల్లా నరేందర్ రెడ్డి

మణికొండ, జనవరి 6 (విజయక్రాంతి): సమాజంలో వాస్తవాలను నిర్భయంగా వెలికితీస్తూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ’విజయ క్రాంతి’ పనిచేస్తోందని మణికొండ మాజీ  వైస్ చైర్మన్ కొండకల్లా నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మణికొండలో ’విజయ క్రాంతి’ నూతన క్యాలెండర్ను మాజీ కోఆప్షన్ సభ్యులు జొన్నాడ సిద్ధప్ప, బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పత్రికపై ప్రశంసల జల్లు కురిపించారు. విజయ క్రాంతి కేవలం పత్రిక మాత్రమే కాదని, అది సామాన్య ప్రజల గొంతుక అని అభివర్ణించారు. ఇందులోని ప్రతి అక్షరం ప్రజల పక్షాన నిలబడుతుందని, నిష్పక్షపాత వార్తలకు ఇది చిరునామా అని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోవాలంటే పాఠకులు విజయ క్రాంతి చూడాల్సిందేనని ఆయన సూచించారు. సమాజ హితం కోరే ఇటువంటి పత్రికలకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని జొన్నాడ సిద్ధప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ శ్రేణులు క్యాలెండర్ ఆవిష్కరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు.