16 March, 2026 | 9:48 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

నాగారం పోలీస్ స్టేషన్ పరిశీలించిన ఎస్పీ నర్సింహ

24-04-2025 01:20 AM

నాగారం, ఏప్రిల్ 23: పోలీస్ స్టేషన్లో సాధారణ తనిఖీలలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు నాగారం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి సలహాలు సూచనలు చేసినారు. మండల పరిధిలో ఎలాంటి అవాంఛను సంఘటనలు జరగకుండా ముందస్తు సమాచారం సేకరిస్తూ ఇబ్బంది ఇంటలిజెన్స్ తో పనిచేయాలని తెలిపారు.

పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న పలు రికార్డులను పరిశీలించారు. ఐలాండ్ ఫిర్యాదులు పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని దర్యాప్తు చేసి బాధితులకు పోలీస్ శాఖ పై నమ్మకం కలిగించాలని ఆదేశించారు.

ఇసుక రవాణాకు సంబంధించి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఇసుక అక్రమ రవాణా చేసే వాహనదారులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  ఎస్పీ వెంట సూర్యాపేట డివిజన్ డిఎస్పి పార్థసారథి, నాగారం రఘువీర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.