16 March, 2026 | 11:10 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ఉగ్రవాదులను అంతమొందించాలి

24-04-2025 01:17 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి

దేవరకొండ, ఏప్రిల్ 23: కశ్మీర్ లోని  పహాల్గంలో పర్యాటకులపై బుల్లెట్లతో దాడులు చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత లస్కరే తోయిబా  ఉగ్రవాదులను అంతమొందించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి డిమాండ్ చేసారు.

గురువారం దేవరకొండ లోని స్థానిక పార్టీ కార్యాలయంలో నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రదాడిలో మరణించిన వారికి రూ.కోటి, గాయపడిన పౌరులకు రూ .25 లక్షల నష్ట పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు.

కశ్మీర్లో పర్యాటకులను కిరాతకంగా చంపిన  ఉగ్రవాదులను  అంతమొందించాలని, ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్ ను ప్రపంచవ్యాప్తంగా ఒంటరి చేయాలని, వాణిజ్య, వ్యాపార, పర్యాటక రంగాలపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో కేంద్రం ప్రభుత్వం విఫలం చెందిందని ధ్వజమెత్తారు.  మృతుల కుటుంబాలకు సీపీఐ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.