24-04-2025 01:20:45 AM
న్యాయశాఖ ఉద్యోగుల సంఘీభావం
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): జమ్మూకశ్మీర్ పహల్ గామ్ ఉగ్రదాడి పరికిపంద చర్య అని న్యాయశాఖ ఉద్యోగుల సంఘం సభ్యులు పేర్కొన్నారు. సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్వీ సుబ్బయ్య ఆధ్వర్యంలో ఉగ్రదాడిని బుధవారం ముక్తకంఠంతో ఖండించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎస్వీ సుబ్బయ్య మాట్లాడుతూ.. మానవతా విలువలకు తిలోదకాలు వదులుతూ జరిగిన ఈ పైశాచిక దాడిని, యావత్ భారతీయులపై జరిగిన దాడిగా భావించాలని, భారతావని ప్రజలందరూ ఏకం కావాలని సూచించారు. కార్యక్రమంలో సిటీ సివిల్ కోర్టు న్యాయశాఖ ఉద్యోగులందరూ పాల్గొన్నారు.