11 March, 2026 | 4:56 AM

ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలి

09-03-2026 04:43 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలంలోని వెల్మల్ బొప్పారం గ్రామంలో పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు బస్సు సదుపాయం కల్పించాలని సర్పంచ్ రాజ కొండ సాగర్ డీఈఓకు వినతిపత్రం అందించారు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సోన్ మండల కేంద్రంలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 14 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ద్వారా బస్సులు ఏర్పాటు చేసిన చొరవ చూపాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో వేణు సురేందర్ భీమేష్ తదితరులు ఉన్నారు.