01-08-2025 08:27:13 PM
నిర్మల్ (విజయక్రాంతి): టీజీ ఆర్టీసీ(TGSRTC) నిర్మల్ డిపో ద్వారా మహారాష్ట్రలోని భద్ర మారుతి అనుమానాలయం విగ్నేశ్వర ఆలయాలకు ఈనెల 15 ప్రత్యేక బస్సు సర్వీస్ నడుపుతున్నట్టు డిఎం పండరీ తెలిపారు. నిర్మల్ నుంచి బయలుదేరిన ఈ బస్సు మహారాష్ట్రలోని వివిధ దేవాలయాలను సందర్శించుకుని మూడు రోజుల్లో తిరిగి నిర్మల్ చేరుకుంటుందని వివరించారు. పెద్దలకు 2000 ఛార్జ్ ఉంటుందని ప్రయాణం చేసేవారు ఫోన్ నెంబర్ 9959226003, 7382842582 నంబర్లను సంప్రదించాలని డిఎం సూచించారు.