అటవీ జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
31-03-2026 12:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 30(విజయక్రాంతి): అటవీ జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ తెలిపారు.
జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో పశుసంవర్ధక శాఖ అటవీ శాఖ సిబ్బందికి జంతువుల రక్షణ తీసుకోవాల్సిన మెలకువలకు సంబంధించి నిర్వహించిన ఒకరోజు వర్క్ షాప్ కు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సురేష్ కుమార్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్, సైంటిస్ట్ అజయ్ గౌర్, బయాలజిస్ట్ ఎల్లంతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డిఓ అప్పయ్య, ఎఫ్ ఆర్వోలు గోవింద్ చంద్ సర్దార్, యోగేష్ పాల్గొన్నారు.




