calender_icon.png 26 June, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీరు వృధా కాకుండా ప్రత్యేక చర్యలు..

25-06-2025 10:49:56 PM

జనగామ (విజయక్రాంతి): వివిధ శాఖల ద్వారా భూగర్భ జలాల సంరక్షణకై విస్తృతంగా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రిజ్వం బాషా షేక్(District Collector Rizwan Basha Shaik) తెలిపారు. జలశక్తి అభియాన్ క్రింద నేషనల్ వాటర్ అవార్డ్స్-2024  కొరకు కేంద్రం నుండి అధ్యయన కమిటీ సభ్యులు కేంద్ర భూగర్భజల శాఖ సైంటిస్ట్ డాక్టర్ ఎమ్ సుధీర్ కుమార్, భూగర్భజల కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ చరణ్ బుధవారం జిల్లాకి విచ్చేసారు. ఈ సందర్బంగా కలెక్టరెట్ లోని కాన్ఫెరెన్స్ హల్ లో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లాలో భూగర్భ జలవనరుల సంరక్షణకి తీసుకుంటున్న చర్యల గురించి కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ముందుగా జిల్లాలో ప్రధాన జలవనరులైన అశ్వరావుపల్లి, చిటకోడూరు, స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ ల సామర్ధ్యంతో పాటు సాగు, త్రాగు నీటివినియోగ వివరాలను కమిటీ సభ్యులకు పి.పి.టి. ద్వారా తెలిపారు. నీటి నిర్వహణలో చేపట్టిన కార్యకలాపాలను వివరిస్తూ... వివిధ శాఖల ద్వారా పటిష్టమైన కార్యాచరణ రూపొందించి అమలు పరుస్తున్నామన్నారు. నీటిపారుదల శాఖ ద్వారా ఆయకట్టు పెంపుదలకు కాకతీయ కాలువల మరమ్మతులు చేపట్టామని, లైనింగ్ పనులు చేపట్టామని, నీరు వృధా కాకుండా పలు చర్యలు తీసుకున్నామన్నారు. జల సంరక్షణ చర్యల వల్ల... తాగు, సాగు నీరు సమృద్ధిగా ఉండటంతో జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. 

గ్రామ సభలల్లో భూగర్భ జలాల ఆవశ్యకతను విస్తరిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో వర్షపు నీటిని ఇంకింప చేసేందుకు ఇంకుడు గుంతలు నిర్మించామని, చెరువు, కాలువలు పూడికలు చేపట్టి...నీటి సంరక్షణకు కృషి చేస్తూ,  ఆయకట్టు పెంపుదల, కాలువలను పటిష్ట పరచడం ద్వారా సాగునీటి సరఫరాలో నీటి వృధాను అరికట్టమన్నారు. నీరు పుష్కలంగా ఉండడంతో ఆయకట్టు పెరిగి ఈసారి గతంలో ఎన్నడు లేని విధంగా రబీ సీజన్లో ధాన్యం దిగుబడి  అధిక మొత్తంలో వచ్చిందని ... రికార్డు స్థాయిలో  ధాన్యం కొనుగోలు జరిపామన్నారు. ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ తోటల సాగు విస్తీర్ణం పెంపుదల చేపట్టామన్నారు. స్ప్రింక్లర్స్, డ్రిప్ వంటి పరికరాల వినియోగంతో  నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

అన్ని గ్రామాలలో నర్సరీలను నిర్వహిస్తూ.. విస్తృతంగా అన్ని చోట్ల ప్లాంటేషన్ కార్యక్రమాలను చేపడుతున్నామని.. తద్వారా వర్షాలు బాగా పడేందుకు.. నీటి సంరక్షణ దోహదపడేలా చేస్తున్నామన్నారు. రిజర్వాయర్ లో నిండా నీరు ఉండడంతో.... చేపల పెంపకం వలన.. సుమారు 80వేల మంది మత్స్య కారులు లబ్ది పొందుతున్నారన్నారు. జిల్లా నుండి  అత్యధికంగా వేరె జిల్లాకి చేపలను ఎగుమతి చేస్తున్నారన్నారు రైతువేదిక లలో సమావేశాలు ఏర్పాటు చేసి నీటిసంరక్షణ విధానాలపై అవగాహన పరుస్తున్నామని, సేంద్రియ ఎరువు వినియోగంపై అవగాహన పరుస్తున్నామన్నారు.భూగర్భజలాలు ఇంకిపోకుండా ఇసుక కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఫ్రైడే... డ్రై డే కార్యక్రమాలు చేపడుతున్నామని, నర్సరీలు, గ్రామపంచాయతీ ట్యాంకర్ ల ద్వారా మొక్కలకు నీటిని సరఫరా జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఓ. వసంత, నీటిపారుదల ఎస్.ఈ. సుధీర్, వ్యవసాయం, ఫిషరీస్ ఇతర శాఖలకి చెందిన అధికారులు పాల్గొన్నారు.